
తెలుగు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ, టీవీ యాంకర్ ఓంకార్ (Omkar).ప్రముఖ టెలివిజన్ షోలను నిర్మించి, హోస్ట్ చేయడంలో సక్సెస్ ఫుల్ అయ్యారు. ఇటీవలే ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 1న థియేటర్లలో విడుదల అయింది.
శివం భజే ఓటీటీ:
డివోషనల్ అంశానికి క్రైమ్ థ్రిల్లర్, దేశభక్తి పాయింట్ను జోడించి దర్శకుడు అఫ్సర్ శివం భజే తెరకెక్కించాడు. వైవిధ్యమైన కథ, ఉన్నతమైన సాంకేతిక విలువలతో నిర్మించినా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేకపోయింది. దీంతో ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా శుక్రవారం ఆగస్ట్ 30 నుంచి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో పెద్దగా మెప్పించలేని ఈ మూవీకి.. ఓటీటీలోనైనా ఆదరణ దక్కుతుందేమో చూడాలి.
కథేంటంటే:
చంద్రశేఖర్ అలియాస్ చందు (అశ్విన్ బాబు) బాల్యంలోనే తండ్రి చనిపోతాడు. తల్లి, చెల్లెలి బాధ్యతల్ని చూసుకుంటూ ఉంటాడు. చందు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ డబ్బులు ఎగ్గొట్టిన వారితో జరిగిన గొడవలో కంటిచూపు కోల్పోతాడు. ఓ దాత ఇచ్చిన కళ్ల ద్వారా చందుకు కంటిచూపు తిరిగివస్తుంది. సర్జరీ జరిగిన తర్వాత చందు జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏవో అంతుచిక్కని జ్ఞాపకాలు అతడిని వెంటాడుతుంటాయి. వైద్యుల దగ్గరికి వెళితే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే ఆ సమస్య అని తేలుతుంది. ఇంతకీ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి? అదెలా జరిగింది? చందుకి వస్తున్న జ్ఞాపకాలు, వాటిలో హత్యల వెనక కథేమిటి? తన ప్రియురాలు శైలజ (దిగంగన సూర్యవన్షీ) కూడా హత్యకి గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు?
అలాగే ఇండియాకు వ్యతిరేకంగా ఓ కెమికల్ ల్యాబ్లో పాకిస్థాన్, చైనా కలిసి చేస్తోన్న కుట్రల గురించి ఏసీపీ మురళి (అర్భాజ్ఖాన్) ఇన్వేస్టిగేషన్లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? మురళికి ఈ ప్రయోగాలకు ఉన్న సంబంధం ఏమిటి? కెమికల్ ల్యాబ్లో పనిచేస్తోన్న ఉద్యోగులను చంపుతున్న కిల్లర్ ఎవరు? ఈ సంఘ విద్రోహ శక్తులను శివుడి అండతో చందు ఎలా అడ్డుకున్నాడు? అనేది మిగతా స్టోరీ.