
కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శోభా శెట్టి(Shobha Shetty). ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో అడుగుపెట్టి.. మరింత పాపులారిటీని, కొంత నెగిటివిటీను కూడా తెచ్చుకుంది. టాస్కుల్లో ఆమె చూపించిన తెగువ కొంతమందికి నచ్చినా.. ప్రతీదానికి గొడవపడే గుణం మాత్రం చాలా మందికి నచ్చలేదు. ఇక షో ముగిసిన తరువాత టోటల్ గా తన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించిన శోభా.. ఇటీవలే తన ప్రియుడు యశ్వంత్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
ఇక తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది ఈ బ్యూటీ. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న తన సొంతింటి కలను నిజం చేసుకుంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు(జనవరి 22న) తాము కొత్త ఇంటికి వచ్చాము అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ లో చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి శోభా మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితమే ఒక అపార్ట్మెంట్ కొందామని చూశాం. అడ్వాన్స్ కూడా ఇచ్చాం. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ భవన నిర్మాణం ఆగిపోయింది. కానీ, ఇప్పుడు నా కల నెరవేరింది. బిగ్బాస్ లో వచ్చిన డబ్బులతో ఈ ఇల్లు కొనలేదు. రెండేళ్ల క్రితమే ఈ అపార్ట్మెంట్ చూశాము. కాస్త ఆలస్యంగా ఈ ఇంటి తాళం నా చేతికి వచ్చింది. ఇంకాస్త వర్క్ పెండింగ్ లో ఉంది. దానికోసం మరో నాలుగు నెలల టైం పడుతుంది. ఆ తర్వాతే షిఫ్ట్ అవుతాం.. అని చెప్పుకొచ్చింది శుభా. ప్రస్తుతం శోభా చేసిన కొత్తింటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.