ఓయూలో కరెంటు, వాటర్​ కొరత అవాస్తవం : డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి

ఓయూలో కరెంటు, వాటర్​ కొరత అవాస్తవం :  డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: వాస్తవాలను ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన ఓయూ చీఫ్ వార్డెన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఓయూలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందని మే 1 నుంచి మే31వరకు సెలవులు ఇస్తూ చీఫ్ వార్డెన్ ఓ ప్రకటన చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూలో కరెంటు, వాటర్ కొరత అవాస్తవమని చెప్పారు  

నీటి కొరతకు ఇదే నిదర్శనం: కేసీఆర్ ట్వీట్

ఓయూలో విద్యుత్, తాగునీటి స‌ర‌ఫ‌రాపై  సీఎం, డిప్యూటీ సీఎం 4 నెల‌లుగా ప్రజ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ట్వీట్ చేశారు. చీఫ్ ​వార్డెన్ కు జారీ చేసిన షోకాజ్ నోటీసులే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 

ఓయూ హాస్టళ్లకు  సెలవులు రద్దు 

వర్సిటీ హాస్టళ్లకు  మే 1 నుంచి 30వరకు  ఇచ్చిన వేసవి సెలవులను ఓయూ అధికారులు రద్దు చేశారు. మంగళ వారం నుంచి హాస్టళ్లు, మెస్​లు యధావిధిగా పనిచేస్తాయన్నారు.