
- బాలింతను పరీక్షిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ సుధీర్
- కాన్పు కోసం వెళ్లిన ముగ్గురు గర్భిణులకు ఇబ్బందులు
- అర్ధరాత్రి మెడికల్ షాపులకు కుటుంబసభ్యుల పరుగులు
పాలకుర్తి, వెలుగు: కాన్పు కోసం వెళ్లిన గర్భిణులు ప్రభుత్వ దవాఖానలో ఆక్సిటోసిన్ఇంజెక్షన్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డారు. దీంతో కుటుంబసభ్యులు అర్ధరాత్రి మెడికల్షాపులకు పరుగులు తీసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పాలకుర్తి మండలం కంబాలకుంట, మల్లంపల్లి, వావిలాల గ్రామాలకు చెందిన ముగ్గురు గర్భిణులకు పురిటి నొప్పులు రాగా.. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్యూటీలో ఉన్న స్టాఫ్నర్సులు శ్వేత, లలిత గర్భిణులను పరీక్షించి.. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు వేయాలని ఆస్పత్రిలో లేవని, బయట తెచ్చుకోవాలని సూచించారు. కుటుంబసభ్యులు మెడికల్ షాపుల్లో తెచ్చేందుకు వెళ్లారు. అప్పటికే అర్ధరాత్రి రెండు గంటలు కావడంతో మెడికల్షాపులు మూసి ఉన్నాయి. చివరకు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి ఇంజెక్షన్లను తీసుకుని వెళ్లారు. వాటిని ముగ్గురు గర్భిణులకు వేయగా సురక్షితంగా కాన్పు అయ్యారు. ఆస్పత్రిలో ఇంజెక్షన్ల కొరతపై తెలుసుకుని శుక్రవారం డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్సుధీర్దవాఖానకు వెళ్లారు. ముగ్గురు బాలింతలను పరామర్శించారు. ట్రాన్స్పోర్ట్కారణంగా ఇంజెక్షన్ల కొరత వచ్చిందని, మరోసారి రిపీట్ కావొద్దని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. బాధ్యులపై ఫార్మాసిస్టులు కవిత, రాధికకు మెమో జారీ చేశారు.