శ్రుతిహాసన్.. చెన్నై స్టోరీ

శ్రుతిహాసన్.. చెన్నై స్టోరీ

‘సలార్‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్న శ్రుతిహాసన్.. తాజాగా ఓ కొత్త చిత్రానికి సైన్ చేసింది. ‘చెన్నై స్టోరీ’ పేరుతో రూపొందు తున్న ఈ చిత్రానికి బాఫ్టా విజేత ఫిలిప్ జాన్‌‌‌‌ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, యూకే గ్లోబల్ స్క్రీన్ ఫండ్ నిర్మిస్తున్న ఈ ఇంగ్లీష్‌‌‌‌ మూవీకి సునీత తాటి కో ప్రొడ్యూసర్. టైమ్రీ ఎన్ మురారి రాసిన ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

వివేక్‌‌‌‌ కల్రా హీరోగా నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన టీమ్, బుధవారం హీరోయిన్‌‌‌‌గా శ్రుతిహాసన్‌‌‌‌ పేరును ప్రకటించారు. వేల్స్‌‌‌‌తోపాటు ఇండియాలో జరిగే ఓ రొమాంటిక్ కామెడీ స్టోరీ ఇది. ఓ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతున్న అను అనే తమిళ అమ్మాయి కథ ఇది. కనిపించకుండా పోయిన తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చిన ఓ వెల్ష్-ఇండియన్‌‌‌‌కు సహాయం చేస్తుందామె. చెన్నై నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ టైటిల్ పెట్టారు.

నిజానికి ఇందులో సమంత నటించాల్సి ఉంది. ఓ ఇండో బ్రిటిష్ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు ఫిలిప్‌‌‌‌ జాన్‌‌‌‌తో వర్క్ చేస్తున్నట్టు 2021లో ఆమె ప్రకటించింది. అయితే సమంత సినిమాలకు బ్రేక్ తీసుకో వడంతో ఇప్పుడా పాత్రను శ్రుతిహాసన్‌‌‌‌ పోషిస్తోంది.