
సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్స్గా తెరకెక్కుతున్న చిత్రం ‘తెలుసు కదా’.ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్.
లేటెస్ట్గా ‘తెలుసు కదా’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల కానుందని స్పెషల్ వీడియో ద్వారా వెల్లడించారు.
ఈ వీడియోలో ఒకరి తర్వాత మరొకరు.. 'హీరోకు ఇద్దరు హీరోయిన్స్ ఫోన్ చేయడం, ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టమని అడగడం, ఆ తర్వాత 'తెలుసు కదా... లవ్ యు 2' అంటూ సిద్ధూ జొన్నలగడ్డ చెప్పడం.. వంటి సీన్స్తో రిలీజ్ డేట్ను స్పెషల్గా తెలిపారు.
ALSO READ : వంద మిలియన్ల స్ట్రీమింగ్ వ్యూస్తో రికార్డ్.. రెండు ఓటీటీలలో ట్రెండింగ్లో ఉన్న తెలుగు హారర్ కామెడీ
అయితే, ఇక్కడ లవ్ యూ 2 అంటే.. ప్రపోజ్ చేస్తున్న అమ్మాయిని ప్రేమించడం కాదు సుమా!.. ఇద్దరినీ ప్రేమించడం అనేలా ఈ వీడియో క్రియేట్ చేశారు. ఇది ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉంది.
ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే సిద్దు జాక్ సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలో తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకునేలా ఓ అందమైన రొమాంటిక్ ప్రేమకథతో వస్తుండటం విశేషం.