సివిల్స్‌ రిజల్ట్స్‌లో సత్తా చాటిన సిద్ధిపేట యువకుడు

సివిల్స్‌ రిజల్ట్స్‌లో సత్తా చాటిన సిద్ధిపేట యువకుడు
  • ఐఏఎస్‌ ఆల్‌ఇండియా 110వ ర్యాంక్‌ సాధించిన మకరంద్
  • మంగళవారం విడుదలైన సివిల్స్‌ ఫలితాలు

సిద్ధిపేట: మంగళవారం ఉదయం ప్రకటించిన ఆల్‌ఇండియా సివిల్స్‌ ఫలితాల్లో సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్‌ సత్తాచాటారు. ఐఏఎస్‌ ఆల్‌ ఇండియా 110వ ర్యాంక్‌ సాధించారు.రాజన్న సిరిసిల్లా జిల్లా రావుపేట మండలం బీముని మల్లారెట్టి గ్రామానికి చెందిన మకరంద్‌ తల్లిదండ్రులు నిర్మల, సురేశ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం వీళ్లు సిద్ధిపేటలోని శ్రీనగర్‌‌ కాలనీలో స్థిరపడ్డారు.