సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో బుకింగ్ యాప్ ద్వారా యూరియాను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు డీఏవో స్వరూప రాణి తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతుల అవసరానికి అనుగుణంగా, సమయానికి యూరియా, ఎరువుల పంపిణీ జరుగుతోందని చెప్పారు. 9,187 మంది రైతులు యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకొని 20,984 బస్తాలు కొనుగోలు చేశారని ఆమె తెలిపారు.
యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడంతో పాటు పంట అవసరాలకు అనుగుణంగా యూరియా పంపిణీ సాధ్యమవుతోందని తెలిపారు. కౌలు రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
