మైనర్​ కార్ ​డ్రైవింగ్.. బస్సును ఓవర్​టేక్​చేస్తుండగా పల్టీ​

మైనర్​ కార్ ​డ్రైవింగ్.. బస్సును ఓవర్​టేక్​చేస్తుండగా పల్టీ​

హుస్నాబాద్,వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆదివారం బస్సును ఓవర్​టేక్​చేయబోగా కారు బోల్తా పడి ఓ బాలుడు చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం..హుస్నాబాద్​కు చెందిన ఎగ్గోజు రిశ్వంత్​(17) హనుమకొండలోని ఓ ప్రైవేట్​ కాలేజీలో ఇంటర్​ ఫస్టియర్ ​చదువుతున్నాడు. సంక్రాంతి పండుగకు సెలవులు ఇవ్వడంతో హుస్నాబాద్​వచ్చాడు. ఆదివారం తన క్లాస్​మేట్స్​అజయ్, వెంకటేశ్​, అఖిల్​తో కలిసి కారులో కరీంనగర్​ వెళ్లాడు.

మధ్యాహ్నం తిరిగి వస్తుండగా హుస్నాబాద్​లోని సెయింట్ ​జోసెఫ్​ స్కూల్​ వద్ద ఆర్టీసీ​ బస్సును ఓవర్​టేక్ ​చేయబోయాడు. కారు ఓవర్ ​స్పీడ్​లో ఉండడంతో అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డుపై కొంతదూరం పల్టీలు కొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడిపిస్తున్న రిశ్వంత్​అక్కడికక్కడే చనిపోయాడు. కారులో ఉన్న అజయ్​, వెంకటేశ్​, అఖిల్​కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. రిశ్వంత్​..ఓవర్​స్పీడ్​తో పాటు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.