
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ని ఉద్దేశించి బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ(Arshad Warsi) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కల్కి సినిమాలో ప్రభాస్ పాత్రని ఉద్దేశించి అదొక జోకర్ రోల్ అని..ప్రభాస్ తనకి జోకర్ లా కనిపించాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా యంగ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోట్ రిలీజ్ చేశాడు.
‘‘ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను తెలియజేసే హక్కు ఉంది. మన అభిరుచికి అనుగుణంగా ఒక్కో నటుడు, ఒక్కో విధంగా సినిమాని ఇష్టపడుతుంటాం. అలాగే ఇతరుల చిత్రాలను, వేరే నటీనటులను విమర్శలు చేస్తుంటాం. అయితే, ఆ విమర్శలను ఎలా వ్యక్త పరుస్తున్నాం..ఎంత స్థాయిలో మాట్లాడుతున్నాం అనేది ఎంతో ముఖ్యమైన విషయం.
అలాగే, నిర్మాణాత్మక, వివరణాత్మక విమర్శలు చేయడంలో ఎలాంటి తప్పులేదు. కానీ, జోకర్ లాంటి పదాలను ఉపయోగించి మాట్లాడటం చాలా తప్పు.‘కల్కి 2898 AD‘ అనేది జోక్ కాదు. ఇండియన్ మైథలాజిని చూపించిన భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ చిత్రమిది. ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అత్యున్నత మీద శక్తితో ఎవరి ఊహలకు అందని విధంగా దీనిని రూపొందించారు. అంతేకాకుండా రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అంత సులభం కాదు అని సిద్దు తెలిపారు.
ఇకపోతే భారతీయ సినిమా పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల్లో ప్రభాస్ అన్న ఒకరు. కేవలం విజయాలతో కూడిన స్టార్ డమ్ కాదు..అంతకు మించిన స్టార్డమ్ ఉంది. ఒక అభిమానిగా వాస్తవాలు మాత్రమే చెబుతున్నా. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మేము ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తాం. దయ చేసి పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం’’ అని ఆయన సిద్ధు భాయ్ ట్వీట్ చేశారు.
ఇప్పటికే..సుధీర్ బాబు స్పందిస్తూ..'నిర్మాణాత్మ కంగా విమర్శించినా పర్వాలేదు. కానీ ఇలా తప్పుగా మాట్లాడవద్దు. వార్సీలో వృత్తినైపుణ్యం లోపించింది. ప్రభాస్ స్థాయి చాలా పెద్దది. అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు`అని తెలిపారు. ప్రభాస్ కి మద్దతుగా ఇప్పటికే నిర్మాత అభిషేక్ అగర్వాల్, సాయికుమార్ ఎస్ కె.ఎన్ నిలిచారు.అయితే ఇది సరిపోదు. ఇంకా టాలీవుడ్ నుంచి చాలా మంది స్పందించాల్సి ఉంది.అయితే వార్సీ వ్యాఖ్యలపై ఇంకా ప్రభాస్ గానీ, అతని కుటుంబ సభ్యులుగానీ స్పందించలేదు.