బఠిండా: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూపై శిరోమణి అకాలీదళ్ నేత, మాజీ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శలకు దిగారు. సిద్ధూ వల్ల కాంగ్రెస్ పార్టీ కామెడీ షోలా మారిందని హర్సిమ్రత్ అన్నారు. సిద్ధూతోపాటు కొందరు నేతలు చేస్తున్న డ్రామాతో పంజాబ్లోని సాధారణ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. కాగా, పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాల్లో సిద్ధూ కొంతకాలంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కింద పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ.. ఇటీవల రాహుల్ గాంధీని కలసి తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. పంజాబీలు, వారి భవిష్యత్ తరాలకు సంబంధించిన సమస్యలపై తిరిగి దృష్టి సారించడానికి ఇదే సరైన సమయమని సిద్ధూ పిలుపునిచ్చారు. నష్ట నివారణ చర్యలకు ఇదే చివరి చాన్స్ అని ట్వీెట్ చేశారు.
Because of Navjot Singh Sidhu Congress Party has become a comedy show in Punjab. Amid all of their drama the common people of Punjab are being crushed. PMJAY was suspended in Punjab after the State didn't provide the payment: Shiromani Akali Dal leader Harsimrat K Badal (24.10) pic.twitter.com/gcK1XSWzRi
— ANI (@ANI) October 24, 2021