పింఛన్‌కు సిగ్నల్‌ కష్టాలు.. డాబా ఎక్కి పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు

పింఛన్‌కు సిగ్నల్‌ కష్టాలు.. డాబా ఎక్కి పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు

నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో పింఛన్ కోసం డాబాలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో మొత్తం 200 మందికి పింఛన్లుండగా మెషీన్​కు  సిగ్నల్ రాక ప్రతి రోజు ఏదో ఒక డాబా ఎక్కక తప్పడం లేదు. కొన్నేండ్లుగా వృద్ధులు, వికలాంగులు పింఛన్​కోసం  మెట్లపై నుంచి డాబాలు ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్నారు.

వృద్ధాప్యంతో మోకాళ్ల నొప్పులు ఉన్నాయని, దీంతో బిల్డింగులపైకి ఎక్కలేకపోతున్నామని సీనియర్​సిటిజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దివ్యాంగుల పరిస్థితి చెప్పలేకుండా ఉంది. సంబంధిత ఆఫీసర్లు స్పందించి తమ గ్రామానికి సిగ్నల్ వచ్చేవిధంగా చూసి పింఛన్ కోసం డాబాలు ఎక్కే పరిస్థితిని దూరం చేయాలని కోరుతున్నారు.