నెలాఖరులోపు ‘శిల్పా లే ఔట్’ ఫ్లైఓవర్ ప్రారంభం ..ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి

నెలాఖరులోపు ‘శిల్పా లే ఔట్’ ఫ్లైఓవర్ ప్రారంభం ..ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి

ఈ నెఖరులోపు శిల్పా లే ఔట్ ఫేజ్–2 ఫ్లైఓవర్అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తయి బ్యూటిఫికేషన్​వర్క్స్​కొనసాగుతున్నాయి. ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి వరకు 1.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లై ఓవర్​కు రూ. 178 కోట్లు ఖర్చు పెట్టారు. దీన్ని మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 

మంగళవారం బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ  ఫ్లై ఓవర్ ను పరిశీలింయి మాట్లాడుతూ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ రూల్స్​మేరకు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వెంట ప్రాజెక్ట్ సీఈ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ హరీశ్, జోనల్ ఎస్ఈ శంకర్ నాయక్ పాల్గొన్నారు. తర్వాత హఫీజ్ పేట్ లో పలు ఏరియాలను ప్రాంతాలను కార్పొరేటర్ జగదీశ్​గౌడ్ తో కలిసి కమిషనర్ పరిశీలించారు. 

హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్ కింద ఉన్న వ్యర్థాలను తొలగించి ఆటలకు అనుకూలంగా మార్చాలన్నారు. అక్కడి నుంచి ఈర్ల చెరువు డ్రైనేజీ డైవర్షన్  పనులను పరిశీలించి, అసంపూర్తి గా ఉన్న వర్క్స్​పూర్తి చేయాలన్నారు.  అలాగే గచ్చిబౌలి ఫ్లై ఓవర్​ను కూడా పరిశీలించారు.