
ఈ నెఖరులోపు శిల్పా లే ఔట్ ఫేజ్–2 ఫ్లైఓవర్అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తయి బ్యూటిఫికేషన్వర్క్స్కొనసాగుతున్నాయి. ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి వరకు 1.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫ్లై ఓవర్కు రూ. 178 కోట్లు ఖర్చు పెట్టారు. దీన్ని మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
మంగళవారం బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ ఫ్లై ఓవర్ ను పరిశీలింయి మాట్లాడుతూ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ రూల్స్మేరకు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వెంట ప్రాజెక్ట్ సీఈ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ హరీశ్, జోనల్ ఎస్ఈ శంకర్ నాయక్ పాల్గొన్నారు. తర్వాత హఫీజ్ పేట్ లో పలు ఏరియాలను ప్రాంతాలను కార్పొరేటర్ జగదీశ్గౌడ్ తో కలిసి కమిషనర్ పరిశీలించారు.
హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్ కింద ఉన్న వ్యర్థాలను తొలగించి ఆటలకు అనుకూలంగా మార్చాలన్నారు. అక్కడి నుంచి ఈర్ల చెరువు డ్రైనేజీ డైవర్షన్ పనులను పరిశీలించి, అసంపూర్తి గా ఉన్న వర్క్స్పూర్తి చేయాలన్నారు. అలాగే గచ్చిబౌలి ఫ్లై ఓవర్ను కూడా పరిశీలించారు.