
శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని సోమవారం ఆంజనేయ స్వామి గుడిలో దొంగలు పడ్డారు. గుడి తలుపులు, తాళం పగలగొట్టి ఉండటంతో అర్చకుడు రమేశ్ పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 60 తులాల వెండి చోరీ అయినట్లు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.