బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటిన సింగరేణి క్రీడాకారులు

బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటిన సింగరేణి క్రీడాకారులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కోల్ ఇండియా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సింగరేణి క్రీడాకారులు సత్తా చాటారు. భారత్​ కోకింగ్ కోల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ధన్​బాద్​లో ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు కోల్​ ఇండియా స్థాయి షటిల్​ బ్యాడ్మింటన్​ పోటీలు జరిగాయి. సింగరేణి క్రీడాకారులు రెండు గోల్డ్ మెడల్స్ సాధించి ప్రతిభను చాటారు. 

వెటరన్​ 45ప్లస్​ పురుషుల సింగిల్స్​ విభాగంలో శ్రీరాంపూర్​ ఏరియాలో డీజీఎంగా పనిచేస్తున్న ఏబీ హరినారాయణ, డబుల్స్ విభాగంలో హరినారాయణ, భూపాలపల్లి ఏరియాకు చెందిన జనరల్ అసిస్టెంట్ పోగుల శంకరయ్య జంటగా ఆడిఫైనల్లో గోల్డ్​ మెడల్స్ సాధించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులకు భారత్​ కోకింగ్ కోల్​ లిమిటెడ్​ సంస్థ చైర్మన్​ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ మనోజ్ కుమార్ అగర్వాల్​ మెడల్స్​ అందజేశారు. క్రీడాకారులను జీఎం వెల్ఫేర్ జీవీ కిరణ్ కుమార్, డీజీఎం పర్సనల్​ కేసా నారాయణ అభినందించారు.