భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో కొత్తగూడెంలోని కంపెనీ హెడ్డాఫీస్లో యాజమాన్యం బుధవారం స్ట్రక్చర్ మీటింగ్ నిర్వహించింది. హెడ్డాఫీస్ నుంచి బాబు క్యాంప్ వరకు రోడ్డు విస్తరణ, ప్రకాశం స్టేడియం అభివృద్ధి, మెయిన్ హాస్పటల్లోని మేల్, ఫిమేల్ వార్డులతోపాటు క్యాజువాలిటీల్లోని వాష్ రూంలలో శానిటరీ పరికరాలు, సౌకర్యాలు ఇతర సమస్యలను యూనియన్ ప్రతినిధులు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.
తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కంపెనీ జీఎం పర్సనల్ కవితా నాయుడు పేర్కొన్నారు. సంఘం ప్రతినిధులు వంగా వెంకట్, ఎస్వీ రమణమూర్తి, రాము తదితరులు పాల్గొన్నారు.
