గోదావరిఖని, వెలుగు: సింగరేణి జీడీకే 11వ గనిలో మైన్ ఇంజినీర్గా పని చేస్తున్న అల్లం నవ్యశ్రీని నారీ శ్రమశక్తి అవార్డు వరించింది. ఈ నెల 8న కోల్కత్తాలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆవార్డును అందుకోనున్నారు.
నవ్యశ్రీ గ్రాడ్యుయేట్ మైనింగ్ ఇంజినీర్గా మొదటి షిఫ్ట్కు ఇన్చార్జిగా వ్యవహరిస్తూ, 200 మంది కార్మికులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆమెను ఆర్జీ–1 ఏరియా జీఎం లలిత్ కుమార్, అధికారులు అభినందించారు.
