క్రిటికల్మినరల్స్ మైన్స్పై సింగరేణి గురి.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో.. మూడు బ్లాక్లలో బిడ్స్ వేసేందుకు కసరత్తు

క్రిటికల్మినరల్స్ మైన్స్పై సింగరేణి గురి..  తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో.. మూడు బ్లాక్లలో బిడ్స్ వేసేందుకు కసరత్తు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: క్రిటికల్​ మినరల్స్​ విభాగంలోకి సింగరేణి వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు బొగ్గు, విద్యుత్​ ఉత్పత్తికే ప్రాధాన్యత ఇస్తున్న సింగరేణి కాలరీస్​ కంపెనీ ఇప్పుడు కొత్తగా క్రిటికల్​ మినరల్స్​ మైన్స్​ వైపు దృష్టి సారించింది. తెలంగాణతో పాటు ఏపీలో క్రిటికల్​ మినరల్స్​ మైన్స్​ను దక్కించుకునేందుకు బిడ్స్​ వేసేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది.

తెలంగాణతో పాటు ఏపీలో..

క్రిటికల్​ మినరల్స్​కు సంబంధించి దేశ వ్యాప్తంగా 20 మినరల్​​బ్లాక్​లకు బిడ్స్​ పిలిచేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. మొదటిసారిగా సింగరేణి కాలరీస్​ సంస్థ క్రిటికల్​ మినరల్స్​ మైన్స్​ను దక్కించుకునేందుకు బిడ్స్​లో పాల్గొనుంది. మొదటి దశలో తెలంగాణలోని వికారాబాద్, ఏపీలోని అల్లూరి సీతారామరాజు, కర్నూల్​ ప్రాంతాల్లోని మినరల్స్​ మైన్స్​ను దక్కించుకునేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది.

 వికారాబాద్​లో టైటానియం, వెనిడియం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గ్రాఫైట్, కర్నూల్​ జిల్లాలో మోలిబ్​ డెనిమ్, మినరల్స్​ బ్లాక్​లను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బిడ్స్​లో పాల్గొనేందుకు అవసరమైన వివరాలను యాజమాన్యం సేకరిస్తోంది. 

ఇందుకోసం అనుభవం కలిగిన నిపుణులతో యాజమాన్యం చర్చిస్తోంది. లాభనష్టాలపై బేరీజు వేస్తూ ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా క్రిటికల్​ మినరల్స్​కు సంబంధించి 20 బ్లాక్​లను కేంద్రం ఇప్పటికే వేలంలో పెట్టింది. సెప్టెంబర్​ 21 వరకు బిడ్స్​ వేసేందుకు కేంద్రం గడువు పెట్టింది. ఈక్రమంలో బిడ్స్​లో పాల్గొనేందుకు సింగరేణి యాజమాన్యం ఇప్పటికే సంస్థలోని ఉన్నత స్థాయి అధికారులతో ఓ కమిటీ వేసింది.

ఒక్కో అడుగు ముందుకు..

బొగ్గు ఉత్పత్తిరంగంలో 135 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న సింగరేణి సంస్థ విద్యుత్​ ఉత్పత్తిలోనూ సత్తా చాటుతోంది. జైపూర్​లో ఏర్పాటు చేసిన ఎస్టీపీపీ దేశంలోనే ప్రసిద్ధి చెందింది. సోలార్​ విద్యుత్​ ఉత్పత్తిలోనూ సింగరేణి విజయవంతంగా ముందుకు సాగుతోంది. 

ఇప్పుడు కొత్తగా క్రిటికల్​ మినరల్స్​ రంగంలోకి సింగరేణి అడుగు పెడుతూ మొదటి దశలోనే తాను అనుకున్న మూడు బ్లాక్​లను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. తెలంగాణ, ఏపీలోని ఈ మూడు బ్లాక్​లను వేలంలో దక్కించుకున్న తర్వాత ఆ అనుభవంతో దేశంతో పాటు విదేశాల్లోనూ క్రిటికల్​ మినరల్స్​ బ్లాక్​లపై దృష్టి సారిస్తామని యాజమాన్యం పేర్కొంటోంది.