కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌లో నీటి ఎద్దడి నివారణకు చర్యలు: సింగరేణి జీఎం లలిత్ కుమార్‘వెలుగు’ కథనానికి స్పందన

కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌లో నీటి ఎద్దడి నివారణకు చర్యలు: సింగరేణి జీఎం లలిత్ కుమార్‘వెలుగు’ కథనానికి స్పందన

గోదావరిఖని, వెలుగు: కోల్‌‌‌‌‌‌‌‌ బెల్ట్‌‌‌‌‌‌‌‌లో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామని, బోర్లు వేసి వాటర్ సప్లై చేస్తామని సింగరేణి జీఎం లలిత్‌‌‌‌‌‌‌‌కుమార్ తెలిపారు. గోదావరిఖనిలో రూ.14 కోట్లతో ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌జీఎఫ్ ప్లాంట్​ నిర్మించి క్లీన్​ వాటర్ చాంబర్లు ఏర్పాటుచేయకపోవడంపై బుధవారం ‘వెలుగు’ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘కోల్​బెల్ట్‌‌‌‌‌‌‌‌లో ఈ ఏడాదీ నీటికి కటకటే' అనే హెడ్డింగ్ వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. బుధవారం అధికారుల బృందంతో కలిసి గోదావరి ఒడ్డున పరిశీలించారు. వేసవి సమీపించడంతో  సింగరేణి ఆర్జీ 1,2,3 ఏరియాల పరిధిలోని అడ్రియాల, సెంటినరీ కాలనీ, 8 ఇంక్లైన్ కాలనీ, విఠల్‌‌‌‌‌‌‌‌నగర్, గంగానగర్, చుట్టు పక్కల ప్రాంతాలకు నీటి సరఫరాపై రివ్యూ చేశారు.

మేడిపల్లి ఓపెన్​కాస్ట్​కందకం ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని గంగానగర్ ఫిల్టర్ బెడ్ వరకు పైప్​లైన్ల ద్వారా తీసుకు వచ్చి అక్కడి నుంచి పంప్ చేస్తామని చెప్పారు. ఆయన వెంట అధికారులు కె.చంద్రశేఖర్​, కెడిఎన్​ వరప్రసాద్​, ఎ.మల్లికార్జున్​, గుర్తింపు సంఘం లీడర్​మడ్డి ఎల్లయ్య, ఇతర ఆఫీసర్లు ఉన్నారు.