
- థర్మల్, సోలార్, వాటర్ ఫ్లోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తిలో మేటి
- నేషనల్, సౌత్ జోన్ స్థాయిలో సంస్థకు గుర్తింపు
- ఎస్టీపీసీ అభివృద్ధికి కాకా ఫ్యామిలీ తీవ్ర కృషి
కోల్బెల్ట్/జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) విద్యుత్ఉత్పత్తిలో జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకుంటోంది. ఉత్తమ ప్రతిభ, అత్యుత్తమ నిర్వహణ, మెరుగైన పద్ధతులతో దేశంలోని సుమారు వంద థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీ.. 2021 ఏప్రిల్నుంచి ఇప్పటిదాకా నాలుగేండ్లలో జాతీయ, సౌత్జోన్స్థాయిలో 53 అవార్డులను కైవసం చేసుకుంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తిలో రారాజుగా నిలుస్తోంది. థర్మల్తో పాటు సోలార్, వాటర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ద్వారా పవర్ జనరేషన్ చేస్తూ ప్రత్యేక గుర్తింపుతోనూ అవార్డులు సాధిస్తోంది.
ప్రభుత్వ థర్మల్ విద్యుత్ కేంద్రాల విభాగంలో అత్యుత్తమంగా100 శాతం ప్లాంట్లోడ్ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) సాధించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తితో రిలీజ్అయ్యే ఫ్లై యాష్ను సద్వినియోగం చేసుకుంటూ పలుమార్లు బెస్ట్ ఫ్లైయాష్ యుటిలైజేషన్అవార్డులు సాధించింది. పర్యావరణ మిత్ర ప్లాంటుగా, వాటర్ఎఫీషియెన్స్ ప్లాంట్అవార్డులు, బెస్ట్ పవర్ ప్లాంట్ఫర్ఫార్మర్ అవార్డులు దక్కించుకుంది.
అదేవిధంగా ఎన్విరాన్ మెంట్ సస్టైనబిలిటీ,సేఫ్టీ, లీడర్షిప్, బిజినెస్ లీడర్ షిప్ ఎక్స్లెన్స్, పవర్ప్లాంట్ పెర్మార్మెన్స్,సేవా, ఎనర్జీ ఎఫిషియన్సీ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్, పొల్యూషన్ కంట్రోల్, గ్రీన్ టెక్ఎన్విరాన్మెంట్, క్లీన్ఎనర్జీ ట్రైయిబ లైజర్అవార్డులను సాధించింది. జాతీయ స్థాయిలో బెస్ట్పీఎల్ఎఫ్,టెక్నాలజీ, టార్గెట్పవర్ జనరేషన్ రీచ్ అంశాల్లో కూడా అవార్డులు వరించాయి. సింగరేణి పవర్ప్లాంట్వివిధ కేటగిరిల్లో పలు అవార్డు లు సాధించడానికి ఉద్యోగులు, ఆఫీసర్లు, యాజమాన్యం సమష్టి కృషి ఉందని సీఎండీ బలరాం నాయక్ పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చుతూ..
ఎస్టీపీపీ రెండు యూనిట్లలో1200 మెగావాట్ల (2×600) సామర్థ్యంతో రోజువారీగా సరాసరి 28 మిలియన్ యూనిట్ల పైగా విద్యుత్ను ఉత్ప్తతి చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు12శాతం పవర్ను అందిస్తోంది. వందశాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధిస్తూ దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. 10 మెగావాట్ల సోలార్పవర్, మరో 10 మెగావాట్ల వాటర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. సెంట్రల్ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒక మెగావాట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి 3 ఘనపు మీటర్ల నీటిని వినియోగించాలని నిర్ణయించింది.
ఎస్టీపీపీ 2.5 ఘనపు మీటర్ల నీటిని వాడుతోంది. నీటి పొదుపులోనూ 6 సార్లు జాతీయ, సౌత్ జోన్ లో ‘బెస్ట్వాటర్ ఎఫీసియెంట్ అవార్డు’ సొంతం చేసుకుంది. ఎస్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గును మండించిన తర్వాత రెండు రకాలుగా వచ్చే బూడిద పౌడర్ ను ఫ్లైయాష్, కొంత రవ్వలాగా వచ్చే బూడిద బాటమ్యాష్ పర్యావరణానికి నష్టం కలిగించేవి. కాగా.. వీటిని రోడ్ల నిర్మాణం, ఇటుకల తయారీకి పూర్తిస్థాయిలో అందిస్తోంది. 100శాతం ఫ్లైయాష్ వాడకంతో ఎస్టీపీపీకి పలు జాతీయ అవార్డులు దక్కాయి.
మూడో ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి వివేక్ కృషి
ఎస్టీపీపీ ఏర్పాటులో కాకా ఫ్యామిలీ కృషి ఎంతో ఉంది. 2005లో కాంగ్రెస్ సర్కార్హయాంలో ఎస్టీపీపీ నిర్మాణం ప్రారంభించగా అప్పటి పెద్దపల్లి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, ఆయన కొడుకు అప్పటి కార్మికశాఖ మంత్రి గడ్డం వినోద్ తమ వంతు కృషి చేశారు. 2009 –-2014 వరకు పెద్దపల్లి ఎంపీగా కాకా మరో కొడుకు, ప్రస్తుత రాష్ట్ర కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొత్త ఎస్టీపీపీ ఏర్పాటుకు చొరవ చూపారు. చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ప్రత్యేక చొరవతీసుకొని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం స్పందించి ఎస్టీపీపీలో 80 శాతం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జాబ్లకు స్థానికులకే చెందేలా జీవో జారీ చేసింది. ప్లాంట్లో 800 మెగావాట్ల మూడో యూనిట్ ఏర్పాటుతో నిరుద్యోగులకు జాబ్లు కల్పించడంతో పాటు సింగరేణికి వందల కోట్ల ఆదాయం వస్తుందని వివేక్వెంకటస్వామి అసెంబ్లీలో ప్రస్తావించి.. ప్లాంట్ఏర్పాటుకు సర్కార్ను ఒప్పించారు. దీంతో సుమారు రూ.7వేల కోట్లతో త్వరలో మూడో యూనిట్నిర్మాణ పనులను ప్రారంభించనుంది.