జూన్ 1 నుంచి సింగరేణి వన మహోత్సవం..1,667 ఎకరాల్లో 40 లక్షల మొక్కలు నాటాలి: సీఎండీ బలరామ్

జూన్ 1 నుంచి సింగరేణి వన మహోత్సవం..1,667 ఎకరాల్లో 40 లక్షల మొక్కలు నాటాలి: సీఎండీ బలరామ్

హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జూన్ 1 నుంచి వనమహోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సింగరేణి నిర్ణయించింది.  ఈ ఏడాది1,667 ఎకరాల్లో 40 లక్షల మొక్కలను నాటి, సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన సింగరేణి భవన్‌‌‌‌లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వన మహోత్సవం, నీటి బిందువు-~జల సింధువు కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.

అనంతరం బలరామ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మికులు, స్థానికుల భాగస్వామ్యంతో వనమహోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఏరియాలో నిర్ణీత లక్ష్యాల మేరకు మొక్కలు నాటాలని ఆదేశించారు. అలాగే..భూగర్భ జలాల పెంపుకోసం సింగరేణి చేపట్టిన ‘నీటి బిందువు~-జల సింధువు’ కార్యక్రమంలో 62 మినీ చెరువుల నిర్మాణ లక్ష్యంలో 48 చెరువులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన చెరువుల నిర్మాణాన్ని వారంలోగా పూర్తి చేయాలని సీఎండీ బలరామ్ స్పష్టం చేశారు. 43 చెరువుల్లో పూడిక తీత లక్ష్యంలో 25 చెరువుల్లో పనులు పూర్తయినట్లు సీఎండీకి అధికారులు తెలిపారు.