గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. వనస్థలిపురం సాహెబ్నగర్ శ్మశాసనవాటికలో అంత్యక్రియలు జరిగాయి. జోహర్ సాయిచంద్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. అంతకుముందు సాయి చంద్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి నివాళులర్పించారు.
2023 జూన్ 28 బుధవారం అర్ధరాత్రి సమయంలో సాయిచంద్ కు గుండెపోటు రావడంతో నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. జూన్ 29 గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సాయి చంద్ కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత పార్థీవ దేహాన్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు.