ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మళ్లీ తీవ్ర అస్వస్థత

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మళ్లీ  తీవ్ర అస్వస్థత

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోనైన‌ట్టు స‌మాచారం. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించిందని తెలుస్తుంది. కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా ఉంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలు ఆరోగ్యం విషమించినట్టు తెలుస్తుంది.

ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ మీడియాకు తెలుపుతూనే ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాసేపట్లో ఎంజిఎం వైద్యులు బాలు ఆరోగ్య ప‌రిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు