ఫిబ్రవరి 23న తెలుగులో సైరన్‌‌ మూవీ రిలీజ్

ఫిబ్రవరి 23న తెలుగులో సైరన్‌‌ మూవీ రిలీజ్

జయం రవి హీరోగా ఆంథోని భాగ్యరాజ్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సైరన్’. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌‌గా నటించారు. ‘గంగ ఎంటర్టైన్మెంట్స్’ అధినేత మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో జయం రవి మాట్లాడుతూ ‘ఇందులోని ఎమోషన్స్, అందుకు జీవీ ప్రకాష్ అందించిన సంగీతం కీరోల్ పోషించాయి. పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌గా కీర్తి అద్భుతంగా నటించింది.

నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు. ‘భారీ బడ్జెట్‌‌తో ఫ్యామిలీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేలా తెరకెక్కించాం. మునుపెన్నడూ కనిపించని పాత్రలో జయం రవి కనిపిస్తారు’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు.