ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శాపనార్థాలు

ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శాపనార్థాలు

కాగజ్ నగర్, వెలుగు :  ‘ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి చూసి తట్టుకోలేకపోతున్నరు. తాము ఇది చేశాం.. అది చేశాం.. అంటూ చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నరు. వాళ్ల కడుపులో మన్నువడ’ అంటూ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శాపనార్థాలు పెట్టారు. సోమవారం కుమ్రం భీం​ ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని జగదాంబ ఫంక్షన్ హాల్ లో నియోజక వర్గ స్థాయి విద్యుత్ విజయోత్సవ సభ నిర్వహించారు. దీనికి కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవ్ రావ్ తో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ సర్కారు చేసే అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేతలకు కడుపులో గ్యాస్ పెరిగిపోతోందని, అభివృద్ధిని అడ్డుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నారు.

Also Read: కాంగ్రెస్ కార్పొరేటర్​పై  ఎమ్మెల్యే అనుచరుల దాడి

కౌటాలకు మంజూరైన 132/32 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం జాగా గుర్తిస్తే అక్కడ కొందరితో రాత్రికి రాత్రే గుడిసె వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సబ్ స్టేషన్ మంజూరు కోసం చెప్పులరిగేలా తిరిగినా పని కాలేదని, ఇప్పుడు నియోజకవర్గంలో ఎనిమిది సబ్​స్టేషన్లు వచ్చాయన్నారు. డీఅర్డీవో సురేందర్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొమురం మాంతయ్య, విద్యుత్ శాఖ డీఈఈ రాజశేఖర్, ఏడీఈ రాజేశ్వర్, శ్రీనివాస్ ఎంపీపీ విశ్వనాథ్, నానయ్య,  పాల్గొన్నారు.