పద్మారావునగర్, వెలుగు: అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకొని సోమవారం పద్మారావునగర్ లోని స్కందగిరి హనుమాన్ మందిర్ లోని శంకర మఠంలో సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. ఉదయం నుంచే భజన కార్యక్రమాలు ఉంటాయని, సాయంత్రం ఆలయంలో దీపోత్సవం నిర్వహిస్తామని ఆలయ సిబ్బంది తెలిపారు.
సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ పాల్గొంటారు. ఆదివారం అయోధ్య రామాలయంలో నిర్వహించిన యాగశాల పూజలో పాల్గొన్న కంచి పీఠాధిపతి ఆదివారం రాత్రి స్కందగిరికి చేరుకున్నారు. రాత్రి స్కందగిరి హనుమాన్ మందిరంలో వందల సంఖ్య లో భక్తులు స్వామిజీని దర్శించుకొని, ఆశీస్సులు తీసుకున్నారు.