ఎన్​కౌంటర్​లో ఆరు నెలల పసిపాప మృతి, తల్లికి గాయాలు

ఎన్​కౌంటర్​లో ఆరు నెలల పసిపాప మృతి, తల్లికి గాయాలు
  • చత్తీస్​గఢ్​లోని బీజాపూర్​జిల్లాలో ఘటన

భద్రాచలం, వెలుగు:  ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్​కౌటర్​లో ఓ పసిపాప కన్నుమూసింది. సోమవారం భైరంగఢ్​ పోలీస్​స్టేషన్ పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.  ఈ ఘటనలో ఆరు నెలల పసిపాపకు బుల్లెట్​తగలడంతో పాటు ఆమె తల్లి కూడా గాయపడింది.

తల్లిని దగ్గర్లోని దవాఖానకు తరలించారు. కాల్పుల్లో భైరంగఢ్​ ఏరియా కమిటీ సభ్యుడు చంద్రన్నతో పాటు మరికొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయని భైరంగఢ్​ ఏఎస్పీ తెలిపారు.  పారిపోయిన మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ఇద్దరు డీఆర్జీ జవాన్లు కూడా గాయపడగా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు