
నవీ ముంబై: స్మృతి మంధాన సెన్సేషనల్ బ్యాటింగ్తో చెలరేగడంతో ఆస్ట్రేలియాపై ఇండియా విమెన్స్ టీమ్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో సూపర్ ఓవర్లో ఆసీస్ను ఓడించి ఐదు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. ఈ ఏడాది ఆసీస్కు తొలి ఓటమి రుచి చూపెట్టింది. సూపర్ ఓవర్లో ఇండియా 20/1 రన్స్ చేసింది. రిచా ఘోష్ సిక్స్, మంధాన సిక్స్, ఫోర్తో చెలరేగింది. తర్వాత ఆసీస్ 16/1 స్కోరుకే పరిమితమైంది. హీలీ రెండు ఫోర్లు, సిక్స్ కొట్టినా టీమ్ను గెలిపించలేకపోయింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 187/1 స్కోరు చేసింది. నాలుగో ఓవర్లోనే అలీసా హీలీ (25) ఔటైనా... బెత్ మూనీ (54 బాల్స్లో 13 ఫోర్లతో 82 నాటౌట్), తాహ్లియా మెక్గ్రాత్ (51 బాల్స్లో 10 ఫోర్లతో 1 సిక్స్తో 70 నాటౌట్) దంచికొట్టారు. మిడిల్ ఓవర్స్లో ఇండియా బౌలర్లు ఫెయిల్ కావడంతో చెలరేగి ఆడిన మూనీ, మెక్గ్రాత్ రెండో వికెట్కు159 రన్స్ జత చేశారు. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ ఒక్క వికెట్ తీసింది. టార్గెట్ ఛేజింగ్లో ఇండియా 20 ఓవర్లలో కూడా 187/5 స్కోరు చేసింది. స్మృతి మంధాన (49 బాల్స్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 79), షెఫాలీ వర్మ (34), రిచా ఘోష్ (26 నాటౌట్), హర్మన్ప్రీత్ కౌర్ (21) రాణించారు. ఇండియా విజయానికి ఆఖరి బాల్కు ఐదు రన్స్ కావాల్సిన దశలో దేవికా వైద్య (11 నాటౌట్) ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. హీథర్ గ్రాహమ్ 3 వికెట్లు తీసింది. స్మృతికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడో మ్యాచ్ బుధవారం జరుగుతుంది.