
ఢిల్లీలో ప్రస్తుతం అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఎస్.ఎన్. శ్రీవాస్తవను నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవాస్తవ ప్రస్తుతం స్పెషల్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీవాస్తవ పూర్తి స్థాయి కమిషనర్గా మార్చి 1న బాధ్యతలు తీసుకుంటారు. కాగా.. ప్రస్తుతం ఢిల్లీ కమిషనర్గా ఉన్న అమూల్య పట్నాయక్ పదవీకాలం రేపటితో ముగియనుంది. అందుకే శ్రీవాస్తవను కమిషనర్గా నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.