కానిస్టేబుల్ పై దాడి చేసిన స్నాచర్స్ అరెస్ట్

కానిస్టేబుల్ పై దాడి చేసిన స్నాచర్స్ అరెస్ట్

సిటీలో చైన్ స్నాచర్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఉషోదయ కాలనీలో మహిళ మెడలోని గొలుసు లాగేందుకు ప్రయత్నించిన స్నాచర్లు.. అదికుదరకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే వారి కోసం వెతుకుతున్నపోలీసులు బాచుపల్లి నుండి లింగంపల్లి వరకు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే పల్సర్ బైక్ పై వస్తున్న ఇద్దరు అనుమానస్పద వ్యక్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యపై వారు కత్తితో దాడి చేసి, పరారయ్యారు. ఆ తర్వాత గాలింపు అనంతరం విశాంత్, రాహుల్ అనే చైన్ స్నాచర్లను రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేశారు. 

గుల్బర్గా నుండి బైక్ పై ఈనెల 22 న నగరానికి వచ్చిన ఇరానీ గ్యాంగ్  చైన్ స్నాచర్స్.. కొండాపూర్, మూసాపేట్, ఆర్సిపురంలో ముగ్గురు మహిళలపై చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఈనెల 25న  మియాపూర్ లోని మాతృశ్రీ కాలనీ లోనూ నిందితుసు మహిళ గొలుసు లాకెళ్లారు. అనంతరం ఇటీవల ఉషోదయ కాలనీలో మరో మహిళ గొలుసు లాగేందుకు ప్రయత్నం చేయగా.. విఫలమై తప్పించుకున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంటకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా ముందు వీరిని ప్రవేశపెట్టనున్నారు.