హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా?

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా?

కరోనా వైరస్ హైదరాబాద్‌లోని రహేజా ఐటీ పార్క్‌లోని మైండ్‌స్పేస్‌లో కరోనా వ్యాప్తి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. మైండ్‌స్పేస్‌లోని డీఎస్ఎం కంపెనీకి చెందిన ఒక మహిళకు ఈ వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చినట్లు సమాచారం. ఆ మహిళ వారం క్రితం ఇటలీ నుంచి వచ్చినట్లు సమాచారం. డీఎస్ఎం కంపెనీ మైండ్‌స్పేస్ ఆవరణలోని బిల్డింగ్ నెంబర్ 20 లో ఉంది. అదే బిల్డింగ్‌లో ఉన్న మరో కంపెనీ ఓపెన్ టెక్ట్స్ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించినట్లు తెలుస్తోంది.