ఉద్యోగం లేక.. లోన్ చెల్లించలేక యువకుడు ఆత్మహత్య

ఉద్యోగం లేక.. లోన్ చెల్లించలేక యువకుడు ఆత్మహత్య

తుంగతుర్తి, వెలుగు: ఉద్యోగం లేదు.. తీసుకున్న లోన్​ చెల్లించలేక మనోవేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రామకోటి తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లికి చెందిన వంగల సుకుమార్ రాజు(28) బెంగళూరులో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేసి, మూడు నెలల క్రితం మానేశాడు.

హైదరాబాద్​లో ఉద్యోగం కోసం వెతుకున్నాడు. పలు యాప్ లలో అధిక మొత్తంలో డబ్బులు లోన్ తీసుకొని, ప్రతినెలా వడ్డీ చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఉద్యోగం దొరక్కపోవడంతో లోన్​చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. 

5 రోజుల క్రితం స్వగ్రామం వచ్చాడు. లోన్​గురించే ఆలోచిస్తూ మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.