హైదరాబాద్‌లో ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

హైదరాబాద్‌లో ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ మెయిన్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్1లో మలుపు వద్ద బైక్‌ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న జగన్‌మోహన్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని 20మీటర్లు ఈడ్చుకెళ్లింది టిప్పర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో డివైడర్‌‌ను డీకొట్టి..

అర్ధరాత్రి మితిమీరిన వేగంతో యువకులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో ఎల్బీనగర్ అండర్ పాస్ లోని డివైడర్ ను కారుతో ఢీకొట్టారు. దీంతో కారు పల్టీలు కొట్టడంతో దానిలోని వారికి గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ సంఘటన జరగడంతో యువకులు కారును వదిలేసి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారుపై 13వేల 350 రూపాయల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. చలాన్ లు అన్నీ ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నాయి. కారు ఓనర్ పంతంగి శ్రీనాథ్ గా పోలీసులు గుర్తించారు.