
ఆకతాయిల పనికి ఏనుగు బలి
పైనాపిల్లో పటాకులు పెట్టారు
కేరళ మలప్పురం దగ్గర్లోని ఓ గ్రామంలో కొందరు ఆకతాయిలు అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. మానవత్వం మరిచిపోయి గర్భంతో ఉన్న ఓ ఏనుగు చావుకు కారణమయ్యా రు. ఆకలితో గ్రామంలోకి వచ్చిన ఏనుగుకు పైనాపిల్లో పటాకులు పెట్టి తినటానికి ఇచ్చారు. ఆ గజరాజు ఫ్రూట్ అనుకుని దాన్ని తినడంతో పటాకులు పేలి నోరు, నాలికకు దెబ్బలు తగిలాయి. నొప్పి తట్టుకోలేక ఊరంతా పరుగులు పెట్టింది. అప్పటికీ రిలీఫ్ లేకపోవటంతో నదిలోకి వెళ్లి గంటల కొద్దీ నీటిలో నిలబడింది. దాని ప్రాణాలు కాపాడేందుకు ఫారెస్ట్ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గజరాజు నదిలో నిలబడే ప్రాణాలు విడిచింది. మే 27 న జరిగిన ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తంచేస్తూ మెహన్ కృష్ణ అనే ఫారెస్ట్ అధికారి తన ఫేస్ బుక్ వాల్ పై గజరాజు నదిలో ఉన్న ఫోటోలతో సహా పోస్ట్ చేశారు.
For More News..