బొందుగాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పారు: బండి సంజయ్

బొందుగాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పారు: బండి సంజయ్

హిందు ధర్మ రక్షణ కోసం ప్రాణమిస్తామన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కొందరు పాలకులు నిజాం అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో హిందూ ఏక్తాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… కరీంనగర్ లో బీజేపీ గెలవడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఎన్నికల్లో బొందుగాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లో అరాచకం చేస్తోందని… ట్రిపుల్ తాలాక్ పేరుతో ముస్లిం మహిళలకు విముక్తి కల్పిస్తే కొందరు తప్పుపడుతున్నారని ఆరోపించారు. మతం పేరుతో విధ్వంసం చేసే వారికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. వరంగల్ లో అమాయక పూజారిని హత్య చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకే ఈ హిందూ ఏక్తాయాత్ర అన్నారు. సర్థార్ పటేల్ స్ఫూర్తితో పనిచేస్తామన్నారు ఎంపీ బండి సంజయ్.