తల్లిని మోసం చేసిన కొడుకు అరెస్ట్

తల్లిని మోసం చేసిన కొడుకు అరెస్ట్

ఆధార్​కార్డు పేరుతో ఆస్తి కాజేసేందుకు యత్నం
తల్లిని మోసం చేసినతనయుడిపై కేసు
మొగల్ పురాలో ఘటన

హైదరాబాద్, వెలుగు: తల్లి నుంచి ఆస్తిని కాజేసేందుకు యత్నించిన కొడుకుపై మీర్​చౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్​స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. రాజేంద్రనగర్​సెగ్మంట్ రాంబాగ్ బస్తీకి చెందిన ద్రౌపతిబాయి-(80) కొడుకు వినోద్​కుమార్(​60). ద్రౌపతిబాయికి పాతబస్తీ లాల్​దర్వాజాలో ఒక ఇల్లు ఉంది. దీన్ని తన పేరు మీద రాయించుకునేందుకు వినోద్​ప్లాన్​చేశాడు. ఆమెకు తెలియకుండానే ఆధార్​కార్డు పేరు చెప్పి తల్లిని నేరుగా సబ్​రిజిస్ట్రార్​ఆఫీస్​కు తీసుకెళ్లాడు.

ఇంటిని తన పేరు మీద రిజిస్టర్​చేయించుకున్నాడు. అయితే మరుసటి రోజు తన ఇంటి వద్దకు వెళ్లిన ద్రౌపతిబాయికి విషయం తెలిసింది. వెంటనే కొడుకును నిలదీసింది. సమాధానం దాటవేశాడు. దీంతో వృద్ధురాలు మొగల్​పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కే వినోద్​ను అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించారు.