ఆధార్కార్డు పేరుతో ఆస్తి కాజేసేందుకు యత్నం
తల్లిని మోసం చేసినతనయుడిపై కేసు
మొగల్ పురాలో ఘటన
హైదరాబాద్, వెలుగు: తల్లి నుంచి ఆస్తిని కాజేసేందుకు యత్నించిన కొడుకుపై మీర్చౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. రాజేంద్రనగర్సెగ్మంట్ రాంబాగ్ బస్తీకి చెందిన ద్రౌపతిబాయి-(80) కొడుకు వినోద్కుమార్(60). ద్రౌపతిబాయికి పాతబస్తీ లాల్దర్వాజాలో ఒక ఇల్లు ఉంది. దీన్ని తన పేరు మీద రాయించుకునేందుకు వినోద్ప్లాన్చేశాడు. ఆమెకు తెలియకుండానే ఆధార్కార్డు పేరు చెప్పి తల్లిని నేరుగా సబ్రిజిస్ట్రార్ఆఫీస్కు తీసుకెళ్లాడు.
ఇంటిని తన పేరు మీద రిజిస్టర్చేయించుకున్నాడు. అయితే మరుసటి రోజు తన ఇంటి వద్దకు వెళ్లిన ద్రౌపతిబాయికి విషయం తెలిసింది. వెంటనే కొడుకును నిలదీసింది. సమాధానం దాటవేశాడు. దీంతో వృద్ధురాలు మొగల్పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కే వినోద్ను అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు.