రూ.20 కోసం గొడవ.. తల్లిని చంపేసిన కొడుకు

రూ.20 కోసం గొడవ..  తల్లిని చంపేసిన కొడుకు
  • తీవ్ర గాయాలతో చనిపోయిన మహిళ
  • రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్‌‌‌‌లో దారుణం

షాద్ నగర్, వెలుగు:20 రూపాయల కోసం తల్లి కొడు కుల మధ్య జరిగిన గొడవ ఒక ప్రాణం పోవడానికి కారణమైంది. తల్లిపై కొడుకు విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె మరణించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో చోటు చేసుకుంది. సుగుణమ్మ (40), తన కొడుకు శివకుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి షాద్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని కేశంపేట రోడ్డులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆదివారం ఉదయం తల్లి సుగుణమ్మ మందు తాగడా నికి కొడుకును రూ.20 అడిగింది. దీంతో శివకుమార్‌‌‌‌‌‌‌‌ కోపంతో తల్లిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఇంటి పక్కనోళ్లు నచ్చజెప్పి, కొడుకును ఇంటి నుం చి బయటకు పంపివేశారు. తర్వాత సుగుణమ్మ కూడా బయటకు వెళ్లి, మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. కొడుకు కొట్టిన విషయాన్ని షాద్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోనే భర్తతో ఉంటున్న తన కూతురు నందినికి చెప్పింది. వెంటనే ఆమె ఇంటికి వచ్చి.. తల్లి, తమ్ముడితో మాట్లాడింది. అమ్మను ఎందుకు కొట్టావని తమ్ముడిని ప్రశ్నించింది. 

డబ్బుల కోసం బాగా సతాయిస్తుందని, ఇంట్లో ఉన్న బంగా రం కుదవపెట్టి తాగడానికి డబ్బులు వాడుకుందని చెప్పాడు. తర్వాత తల్లికి, తమ్ముడికి నచ్చజెప్పి.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కా తమ్ముడు బయటికి వెళ్లిపోయారు. అనంతరం తల్లి సుగుణమ్మ కూడా బయటికి వెళ్లి తాగొచ్చి, ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోయింది. చుట్టుపక్కల వారు గమనించి, ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు మళ్లీ కూతురు నందినికి ఫోన్ చేసి కొడు కు డబ్బులివ్వడం లేదని, తనకు డబ్బులు ఇప్పించాలని చెప్పడంతో.. తాను ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పింది. 

సోమవారం ఉదయం 9 గంటలకు కొడుకు తల్లి సుగుణమ్మను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే ఇంటికి పక్కనున్న వాళ్లను పిలిచి చూపించగా, సుగుణమ్మ చనిపోయిందని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సుగుణమ్మ డెడ్‌‌‌‌బాడీని పోస్టుమార్టం కోసం షాద్‌‌‌‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.