
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబయిలోని బాంద్రా- కుర్లా కాంప్లెక్స్ లోని తన ఇంటిని ఢిల్లీకి చెందిన ఓ కంపెనీకి రూ.32.50 కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే ఈ బాలీవుడ్ బామ.. అప్పట్లోనే నాలుగు కార్ల పార్కింగ్ స్లాట్ ను తీసుకుంది. అయితే ఈ అపార్ట్ మెంట్ ను 8 ఏళ్ల క్రితమే కొనుగోలు చేసినట్టు రికార్డు చెబుతున్నాయి. కాగా తాజాగా ఈ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి రూ.1.95 కోట్ల స్టాంప్ డ్యూటీ కట్టినట్టు సమాచారం. వాస్తవానికి 2015లో సోనమ్ కపూర్ ఈ అపార్ట్మెంట్ని రూ.17.18 కోట్లకి కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు ఆమె ఏకంగా రూ.32 కోట్లకి దాన్ని అమ్మడం విశేషం.
సోనమ్ కపూర్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే దాదాపు 15 ఏళ్లు అవుతోంది. కాగా ఆనంద్ కుమార్ తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఆమె.. 2018లో ముంబయిలో పెళ్లి చేసుకుంది. 2022, ఆగష్టు 20న సోనమ్ కపూర్ ఓ కుమారుడకి జన్మినిచ్చింది. ఆ చిన్నారికి వాయు కపూర్ అహుజా అని పేరు కూడా పెట్టారు. ఇక సోనమ్ కపూర్ బ్లైండ్ సినిమాలో కనిపించనుండడంపై సందిగ్ధత నెలకొంది.