న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలంటూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. వాంగ్ చుక్ మద్దతుదారుల ఆందోళనను తోసిపుచ్చలేమని చెబుతూ ఆసుపత్రి మార్పునకు అనుమతించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వాంగ్చుక్ను మంగళవారం సాయంత్రం సఫ్దర్జంగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి.. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా సఫ్దర్జంగ్ ఆస్పత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వాంగ్చుక్ను మంగళవారం సాయంత్రం 6:40 గంటలకు డిశ్చార్జ్ చేసి, తదుపరి ట్రీట్మెంట్కోసం గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రి డాక్టర్ల బృందానికి అప్పగించినట్టు తెలిపింది.
డిశ్చార్జ్ సమయంలో ఆయన హెల్త్పారామీటర్స్ అన్నీస్టేబుల్గా ఉన్నాయని తెలిపింది. అయితే, పాన్సైటోపేనియా (ప్యాన్సైటోపేనియా) సమస్య కొనసాగుతోందని తెలిపింది. ట్రీట్మెంట్లో ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధిత మెడికల్రిపోర్ట్స్, డాక్యుమెంట్లను మేదాంత డాక్టర్ల టీంకు అందించినట్లు వెల్లడించింది.
నీట్ పేపర్ లీక్పై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆందోళనలలో భాగంగా నిరాహార దీక్ష చేసిన వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా సఫ్దార్జంగ్ ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలన్న పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బెంచ్ తాజాగా సానుకూలంగా స్పందించింది.
