
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. రెగ్యులర్ చెకప్లో భాగంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. సోనియా గాంధీ వయసు 73 సంవత్సరాలు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె సర్వైకల్ క్యాన్సర్కు చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే సాధారణ హెల్త్ చెకప్ కోసం ఆమె సర్ గంగారాం ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆసుపత్రిలో ఉన్నారని సమాచారం.