
UPA అధ్యక్షురాలు సోనియాగాంధీ వయస్సు, ఆరోగ్య కారణాలతో 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనే ఊహాగానాలపై స్పష్టత నిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నియోజకవర్గం నుంచి సోనియా మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ గురువారం రాత్రి 15 మందితో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో నలుగురు గుజరాత్, 11 మంది ఉత్తర ప్రదేశ్ అభ్యర్థులున్నారు. దీనికి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ నిన్న(గురువారం) రాత్రి ప్రకటన విడుదల చేశారు.