కరోనా విపత్కర సమయంలో నేనున్నా అంటూ ఎందరో అభాగ్యులకు అభయ హస్తం ఇచ్చిన 'రీల్ విలన్', 'రియల్ హీరో' సోనూసూద్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో సోనూ సూద్ ఒక మొక్కజొన్న కంకుల విక్రేతతో మాట్లాడినట్లు తెలుస్తోంది. హిమాచల్లోని మనాలి నుంచి సిసు కి వెళ్లే రోడ్డుపై స్టాల్ ఎదుట ఒక వ్యక్తి కార్న్ అమ్ముతున్నాడు.
అక్కడికి వచ్చిన సోనూసూద్ ఆ వ్యక్తితో మాట్లాడాడు. తాను ఉత్తర్ప్రదేశ్లోని జన్పూర్ నుంచి కంకులు విక్రయించడానికి ఇక్కడికి వచ్చానని శేష్ పరకాష్ నిషాద్, సోనూతో చెబుతాడు. ఒక్కో కంకుని రూ.50 కి అమ్ముతున్నానని ఆయనతో అంటాడు. సోనూసూద్ మాట్లాడుతూ.. పొట్ట కూటి కోసం అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎంతలా కష్టపడుతున్నాడో చూడండి అంటూ చెబుతారు.
న్యూ కార్న్ షాప్ చిరు వ్యాపారులను ఆదుకోవాలనే క్యాప్షన్ని ఆ వీడియోకి జత చేసి పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ని షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా చూశారు. సోనూ నిరాడంబరతను నెటిజన్లు మెచ్చుకుంటూ కంకుల విక్రేతకు మంచి భవిష్యత్తు ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.