మొక్కజొన్న కంకులు అమ్మే వ్యక్తితో  సోనూసూద్.. ఏం మాట్లాడాడంటే?

మొక్కజొన్న కంకులు అమ్మే వ్యక్తితో  సోనూసూద్.. ఏం మాట్లాడాడంటే?

కరోనా విపత్కర సమయంలో నేనున్నా అంటూ ఎందరో అభాగ్యులకు అభయ హస్తం ఇచ్చిన 'రీల్​ విలన్​', 'రియల్ హీరో' సోనూసూద్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియోలో సోనూ సూద్​ ఒక మొక్కజొన్న కంకుల విక్రేతతో మాట్లాడినట్లు తెలుస్తోంది. హిమాచల్​లోని మనాలి నుంచి సిసు కి వెళ్లే రోడ్డుపై స్టాల్​ ఎదుట ఒక వ్యక్తి కార్న్​ అమ్ముతున్నాడు.

అక్కడికి వచ్చిన సోనూసూద్​ ఆ వ్యక్తితో మాట్లాడాడు. తాను ఉత్తర్​ప్రదేశ్​లోని జన్పూర్​ నుంచి కంకులు విక్రయించడానికి ఇక్కడికి వచ్చానని శేష్​ పరకాష్​ నిషాద్, సోనూతో చెబుతాడు. ఒక్కో కంకుని రూ.50 కి అమ్ముతున్నానని ఆయనతో అంటాడు. సోనూసూద్​ మాట్లాడుతూ.. పొట్ట కూటి కోసం అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎంతలా కష్టపడుతున్నాడో చూడండి అంటూ చెబుతారు.

న్యూ కార్న్​ షాప్​ చిరు వ్యాపారులను ఆదుకోవాలనే క్యాప్షన్​ని ఆ వీడియోకి జత చేసి పోస్ట్​ చేశాడు. ఈ పోస్ట్​ని షేర్​ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా చూశారు. సోనూ నిరాడంబరతను నెటిజన్లు మెచ్చుకుంటూ కంకుల విక్రేతకు మంచి భవిష్యత్తు ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.