అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు.. నిందితులు అరెస్ట్

అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు.. నిందితులు అరెస్ట్

సంగారెడ్డి జిల్లాలో లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై 60 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని హైదరాబాద్ నుంచి బీదర్ కు తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. లారీ డ్రైవర్లు బీమాబాయి, రాళ్ల ముంజ రాజాబాయ్ ను అదుపులోకి తీసుకున్న  రామచంద్రాపురం పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.