హాస్పిటల్ నుంచి గంగూలీ డిశ్చార్జ్

హాస్పిటల్ నుంచి గంగూలీ డిశ్చార్జ్

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 27న కరోనా సోకడంతో ఆయన కోల్కతాలోని ఉడ్ ల్యాండ్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. 4 రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికి పంపినప్పటికీ గంగూలీని మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఆయనకు ఇంట్లోనే ట్రీట్మెంట్ కొనసాగించనున్నారు. 14 రోజుల అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది అనారోగ్యం కారణంగా గంగూలీ హాస్పిటల్లో చేరడం ఇది రెండోసారి. జనవరిలో ఆయనకు గుండె సమస్య తలెత్తడంతో యాంజియోప్లాస్టీ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ముంబైలో 144 సెక్షన్ పొడిగింపు

బట్టలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా