ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండంతో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముంబైలో 144 సెక్షన్ ను జనవరి 15 వరకు పొడిగించింది. బీచ్లు, ఓపెన్ గ్రౌండ్ లు, సముద్రతీర ప్రాంతాలు, పార్కుల్లో జనం ఎంట్రీపై సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నిషేధం విధించినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడంపైనా ఆంక్షలు విధించారు. ఈ ఉత్తర్వులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జనవరి 15 వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది.
Maharashtra | Restrictions under Section 144 of CrPC extended in Mumbai till Jan 15. Mumbai Police prohibits citizens from visiting beaches, open grounds, sea faces, promenades, gardens, parks, or similar public places, from 5 pm to 5 am. #Omicron pic.twitter.com/AbHYEJiFKr
— ANI (@ANI) December 31, 2021
మరిన్ని వార్తల కోసం..