బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్గా చేరేందుకు సిద్ధమయ్యారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి చర్చలు అన్ని ముగిశాయని సమాచారం. 2023లో జరగనున్న ఐపీఎల్ నుండి గంగూలీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన గంగూలీ .. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్కు మెంటర్గా ఉన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ కోచ్ రికీ పాంటింగ్ తో పాటుగా గంగూలీ హస్తం ఉందని తెలుస్తోంది.
దాదాగా పేరొందిన గంగూలీ 16 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో భారత్ తరఫున 311 వన్డేలు, 113 టెస్టులు ఆడాడు. వన్డేల్లో 22 సెంచరీలతో 11363 పరుగులు చేశాడు. గంగూలీ 16 సెంచరీలతో 7212 టెస్టు పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్, పూణే వారియర్స్ ఇండియా తరపున ఆడాడు. ఆటగాడిగా కెరీర్ నుంచి ముగించాక సీఏబీ ప్రెసిడెంట్, బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.