ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండు మూడ్రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిశోర్ సమర్పించిన 600 పేజీల నివేదకను కాంగ్రెస్ నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. రేపు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పీకే భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొనే అవకాశం ఉంది. రెండు మూడ్రోజుల్లో పీకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపినట్లు ఏఎన్ఐ ప్రచురించింది. పార్టీలో చేరికపై ప్రశాంత్ కిశోర్ కేవలం గాంధీ కుటుంబంతోనే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ సమర్పించిన రిపోర్ట్ ను పరిశీలించేందుకు సోనియా నియమించిన కమిటీకి... పార్టీలో పీకే చేరికకు ఎటువంటి సంబంధం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏప్రిల్ 16, ఏప్రిల్ 18న రెండుసార్లు సోనియా గాంధీ నివాసంలో సమావేశమైన ప్రశాంత్ కిశోర్ శుక్రవారం మరోసారి భేటీ కానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్లోకి పీకే..!
- దేశం
- April 21, 2022
లేటెస్ట్
- అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురు అరెస్ట్
- ఐపీఎల్ టికెట్ల విక్రయంపై విచారణ జరపాలి
- వికారాబాద్ జిల్లా కోర్టుకు భూమిని కేటాయించండి : గడ్డం ప్రసాద్ కుమార్
- తలకొండపల్లిలో తహసీల్దార్ పై కిడ్నాప్ కేసు
- మళ్లీ వరద ముంపేనా .. ఇంకా పెండింగ్ లోనే ఫేజ్ –1 నాలాల పనులు
- ఇథనాల్ కంపెనీలను రద్దు చేయాలి.. ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్
- శ్రీరామనవమి శోభాయాత్రలో8 చైన్లు, 20పైగా సెల్ ఫోన్లు చోరీ
- ఆ 106 ఎకరాలు అటవీ శాఖవే.. తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు
- భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్!
- యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయిల్.. ఇరాన్పై క్షిపణి దాడి
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్