రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్‌లోకి పీకే..! 

రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్‌లోకి పీకే..! 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండు మూడ్రోజుల్లో  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిశోర్ సమర్పించిన 600 పేజీల నివేదకను కాంగ్రెస్ నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.  రేపు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పీకే భేటీ కానున్నారు. ఈ సమావేశంలో  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొనే అవకాశం ఉంది. రెండు మూడ్రోజుల్లో పీకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపినట్లు ఏఎన్ఐ ప్రచురించింది. పార్టీలో చేరికపై ప్రశాంత్ కిశోర్ కేవలం గాంధీ కుటుంబంతోనే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ సమర్పించిన రిపోర్ట్ ను పరిశీలించేందుకు సోనియా నియమించిన కమిటీకి... పార్టీలో పీకే చేరికకు ఎటువంటి సంబంధం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏప్రిల్ 16, ఏప్రిల్ 18న రెండుసార్లు సోనియా గాంధీ నివాసంలో సమావేశమైన ప్రశాంత్ కిశోర్ శుక్రవారం మరోసారి భేటీ కానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.