సత్తాచాటిన భారత బౌలర్లు..106 రన్స్ చేసిన సౌతాఫ్రికా

సత్తాచాటిన భారత బౌలర్లు..106 రన్స్ చేసిన సౌతాఫ్రికా

తొలి టీ20లో  సౌతాఫ్రికా 106 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. వరుస వికెట్లు తీసి సఫారీలను కోలుకోలేని దెబ్బతీశారు. 3 ఓవర్లకే 5 వికెట్లు తీసి ఔరా అనిపించారు. తొలి ఓవర్ లోనే  సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా అవుటయ్యారు. దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్ లో బవుమా క్లీన్ బౌల్డయ్యాడు. సెకండ్ ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టి సూపర్బ్ అనిపించాడు.

ఆ తర్వాత ఓవర్ వేసి దీపక్ చాహర్ ట్రిస్టన్ స్టబ్స్ ను ఔట్ చేశారు. దీంతో పీకల్లోతూ కష్టాల్లో పడ్డ సౌతాఫ్రికాను కేశవ్ మహరాజ్ ఆదుకున్నాడు. నిలకడగా ఆడి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోర్ ను అందించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు, హర్షల్ పటేల్ 2వికెట్లు తీశారు. 

అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన హార్దిక్, భువనేశ్వర్ దూరమవ్వగా..వారి స్థానంలో పంత్, అర్షదీప్ క్రీజులోకి వచ్చారు. అదేవిధంగా బుమ్రా స్థానంలో దీపక్ చాహర్‌, చాహల్ స్థానంలో అశ్విన్  ఆడుతున్నారు.