దక్షిణాఫ్రికా క్రికెటర్ కు కరోనా… ఇంగ్లాండ్ తో మొదటి వన్డే వాయిదా

దక్షిణాఫ్రికా క్రికెటర్ కు కరోనా… ఇంగ్లాండ్ తో మొదటి వన్డే వాయిదా

కరోనా క్రమంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆటలు నిర్వహిస్తున్నారు. అయితే చిన్న తప్పిదాలతో ఆటగాళ్లు కూడా కరోనా బారినపడుతున్నారు. లేటెస్టుగా  దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో ఓ ఆటగాడు కరోనా బారినపడడంతో ఇంగ్లాండ్ తో ఇవాళ (శుక్రవారం) జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వాయిదా పడింది. మ్యాచ్ కు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆ ప్లేయర్ కు పాజిటివ్ వచ్చినట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ధారించింది. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సమాచారం అందించింది. తర్వాత మొదటి వన్డేను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేయాలని రెండు దేశాల బోర్డులు నిర్ణయించాయి.

రెండు జట్లలోని ఆటగాళ్లు, అంపైర్లు, మ్యాచ్ తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ వాయిదా వేసినట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు… ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ప్రకటించాయి. అయితే  కరోనా బారిన పడిన ఆ ఆటగాడు ఎవరన్నది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించలేదు.