కాజీపేట సెక్షన్ ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

కాజీపేట సెక్షన్ ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం
  • అరుణ్ కుమార్ జైన్ తో సహా ఇతర అధికారుల తనిఖీలు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​ డివిజన్​పరిధిలోని కాజీపేట సెక్షన్​ను దక్షిణ మధ్య రైల్వే జనరల్​మేనేజర్​అరుణ్​కుమార్​జైన్​ ఇతర అధికారులతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ట్రాక్​ లు, వంతెనలు, సిగ్నలింగ్ వ్యవస్థల నిర్వహణకు సంబంధించిన భద్రతా అంశాలను పరిశీలించారు. తర్వాత కాజీపేట రైల్వే స్టేషన్ ను క్షుణ్నంగా తనిఖీ చేశారు.

స్టేషన్ లో ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు. స్టేషన్ లో కొనసాగుతున్న వెయిటింగ్ హాల్ విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాజీపేటలో నూతనంగా అభివృద్ధి చేసిన దక్షిణ మధ్య రైల్వే పాలీ క్లినిక్ ను జీఎం అరుణ్​కుమార్ జైన్  ప్రారంభించారు. ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలపై ఆరా తీశారు.

రోగులు, వైద్య సిబ్బందితో ఆయన సంభాషించారు. అనంతరం కాజీపేటలో నూతనంగా నిర్మించిన కోచ్ నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బంది లాబీని కూడా తనిఖీ చేసిన జీఎం అరుణ్ కుమార్  సిబ్బందితో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.